| తిరుపతిలో భక్తులకు సమస్యల వెల్లువ |
| డయల్ యువర్ ఈవోలో భక్తుడు ఫిర్యాదు |
తిరుపతిలో శ్రీవారి భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తితిదే ఈవో ఎల్వీ సుబ్రమణ్యంకు ఫిర్యాదు చేశారు. తిరుమలలో డయల్ యువర్ తితిదే ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో తితిదే జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఎం.కె.సింగ్, సీఈ చంద్రశేఖరరెడ్డి, ఎస్ఈ రమేష్రెడ్డి, ఆరోగ్య అధికారి భీష్మయ్యనాయుడు, ఈడీపీ మేనేజరు భాస్కర్, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, పీఆర్వో రవి, ఏపీఆర్వో నీలిమారావు పాల్గొన్నారు.
|
|