తిరుమల శ్రీవారి స్థిర , చరాస్తుల విలువ రూ. 33, 447.74 కోట్లుగా తేల్చారు. మన రాష్ట్రంలోని ఆస్తులను రూ. 33 , 149,16 కోట్లుగానూ , పొరుగు రాష్ట్రాల్లోని ఆస్తుల విలువ రూ. 298.58 కోట్లుగా గుర్తించారు. శ్రీవారి ఆస్తులు , ఆభరణాలపై విమర్శలు రావడంతో టిటిడి శాస్త్రీయ పద్ధతిలో కచ్చితమైన లెక్కలు వేయించింది. తిరుమల శ్రీవారి ఆలయం , టిటిడి నిర్మించిన భవనాలతోపాటు భక్తులు సమర్పించిన భూములు , భవనాలు , ఆలయాలు , ఇతర ఆస్తులు వివరాలను సేకరించింది. గతంలో ఎస్ట్టేట్ ఆఫీసర్గా పనిచేసిన , రామచంద్రారెడ్డి , టిటిడి , పంచాయతీ , ప్రాపర్టీసెల్ యంత్రాంగంతో కలిసి అన్ని ప్రాంతాల్లో తిరిగి ఆస్తుల వివరాలు సేకరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటి విలువను మదింపు చేసిన టిటిడి ఆ వివరాలను గత ఏడాది హైకోర్టుకు సమర్పించింది. తాజాగా శ్రీవారి ఆభరణాలు ,వాటి విలువతో సిద్ధం చేసి జాబితాను కోర్టుకు సమర్పించనుంది. టిటిడి కోర్టుకు సమర్పించిన ఆస్తుల కచ్చితమైన జాబితాను సేకరించి ఆ వివరాలు భక్తులకోనం ఇస్తున్నాం.
మన రాష్ట్రంలో శ్రీవారి ఆస్తులు
ప్రాంతం ఎకరాలు విలువ రూ. కోట్లలో
ఆదిలాబాద్ 10.33 11.27
అనంతపూర్ 36.45 18.37
చిత్తూరు 3,079.68 32,431.76
తూర్పుగోదావరి 35.16 52.94
గుంటూరు 23.12 35.36
హైదరాబాద్ 189.2 108.2
కడప 140.32 35.6
కరీంనగర్ 14.1 24.81
ఖమ్మం 18.36 40.36
కృష్ణా 85.1 104.69
కర్నూలు 26.6 14.05
మహబూబ్నగర్ 64.54 45.58
మెదక్ 22.33 20.02
నల్లగొండ 15.62 26.24
నెల్లూరు 21.35 10.16
నిజామాబాద్ 14.16 26.92
ప్రకాశం 115.72 14.18
రంగారెడ్డి 17.72 8.50
శ్రీకాకుళం 8.08 8.90
విజయనగరం 9.01 13
విశాఖపట్నం 11.54 43.24
వరంగల్ 9.84 18.96
పశ్చిమగోదావరి 31.72 36.05
మొత్తం 3,999.77 33,149.16
ఇతర ప్రాంతాల్లో
ప్రాంతం ఎకరాలు విలువరూ.కోట్లలో
కర్ణాటక 14.74 21.37
కేరళ 1.44 8.23
న్యూఢిల్లీ 22.47 29.62
ఒరిస్సా 2.08 38.74
పాండిచ్చేరి 0.29 0.41
తమిళనాడు 80.35 124.1
ఉత్తరాఖాండ్ 19.83 75.32
నేపాల్ 2.7 0.76
మొత్తం 143.9 298.58
శ్రీవారి మొత్తం ఆస్తుల వివరాలు
ప్రాంతం ఎకరాలు విలువ రూ. కోట్లలో
ఆంధ్రప్రదేశ్ 3,999.77 33,149.16
ఇతర ప్రాంతాలు 143.9 298.58
మొత్తం 4,143.67 33,447.74